న్యూడిల్లీ, రైతుముచ్చట: భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవలి విడుదల చేసిన రెండవ ముందస్తు అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 2020-21 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 329.86 మిలియన్ టన్నుల
ఉద్యాన
పంటల
ఉత్పత్తి
నమోదయ్యే
అవకాశం
ఉందని
తెలిపింది.
గత
సంవత్సర
ఉద్యాన
పంటల
ఉత్పత్తితో పోలిస్తే, 9.39 మిలియన్ టన్నులు
అధికంగా, 2.93% వృద్ది రేటుతో, ముఖ్యంగా
పండ్లు, కూరగాయలు, సుగంధ
ద్రవ్యాలు
మరియు
ఔషద
పంటలలో
ఈ
అధిక
ఉత్పత్తి
సాదించడం
జరిగింది.
ఇదిలా
ఉండగా
పూల
ఉత్పత్తి
& మార్కెటింగ్ పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండి, గత
సంవత్సరంతో పోలిస్తే 7.17% తక్కువగా పూల
ఉత్పత్తి
జరిగింది.
గత
సంవత్సరం
కూరగాయల
ఉత్పత్తి
188.28 మిలియన్ టన్నులు ఉండగా, ఈ
సారి
4.42% పెరుగుదలతో 196.27 మిలియన్ టన్నులు
ఉత్పత్తి
జరగబోయే
అవకాశం
ఉందని
భారత
వ్యవసాయ
మంత్రిత్వ
శాఖ
తెలిపింది.
0 Comments