హైదరాబాద్, రైతుముచ్చట: హైదారాబాద్ లో ట్రాఫిక్ రద్దీ మరియు మార్కెట్ ను ఆధునీకరించి రైతులకు మంచి మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలని, ఇప్పటికే కొత్తపేట గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను హైదరాబాద్ శివార్లలోని
కోహెడకు తరలించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియాలో అతిపెద్దదైన
కోహెడ మార్కెట్ లో సదుపాయల ఏర్పాటుకు మరి కొంత సమయం పడుతున్నందున తాత్కాలికంగా
బాటసింగారంలో ఫ్రూట్ ఏర్పాటు చేయాలని నిర్ణనించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
అంతేకాకుండా బాటసింగారంలో ప్రస్తుతం లాజిస్టిక్ కార్గో ఉన్నందున దీనిని ఎంచుకోవడం
జరిగిందని, త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బాటసింగారం
మార్కెట్ ను ప్రారంభం చేస్తామని మంత్రి తెలిపారు.
0 Comments