Breaking News
Loading...

రైతు భీమా ధరఖాస్తుకు ఆగష్టు 11 చివరి తేదీ

తెలంగాణ, రైతుముచ్చట: తెలంగాణలో కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు మరియు ఇంతకుముందు రైతు భీమా చేసుకోని రైతులు ఈ సంవత్సరం రైతు భీమా (రైతు మరణిస్తే వచ్చే 5 లక్షల భీమా) చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కావున రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

రైతు భీమా నియమ నిబంధనలు:

తేదీ 03.08.2021 లోపు రైతు తన భూమిని రిజిస్టర్ చేసుకొని ఉండాలి.

రైతులు 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అంటే 14.08.1962 నుండి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి.

వయస్సు పక్కాగా ఆధార్ కార్డ్ ప్రకారమే తీసుకుంటారు. అందులో ఎలా ఉంటే అదే ప్రామాణికం.

ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే భీమాకు అవకాశం ఉంటుంది.

రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ AEO కు అందజేయాలి.

AEO మరియు MAO లు వాళ్ళ లాగ్ ఇన్ నుండి 12.08.2021 లోపే LIC కి పంపాలి.

కావున రైతులు 11.08.2021 లోపే అప్లికేషన్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళవి ఆన్లైన్ చేయడానికి వీలు అవుతుంది.

ఇప్పుడు మీరు భీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు భీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు.

Post a Comment

0 Comments