హైదరాబాద్, రైతుముచ్చట: పశువైద్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పార్లమెంట్
సభ్యురాలు మేనకాగాంధీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమని, ఆగ్రాలో ఒక పశు వైద్యుడిని MP మేనకాగాంధీ దుర్బాష లాడటం పట్ల అఖిల భారత పశువైద్య సంఘం పిలుపు మేరకు తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా బుదవారం రోజు పశువైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం.
ఈ సంధర్భంగా తెలంగాణా పశువైద్యుల సంఘం ఆధ్వర్యంలో పశుసంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు
వినతిపత్రాన్ని అందజేశారు. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులు ప్రజాజీవితంలో పేదలకు
జీవనాధారమైన జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న పశు వైద్యుల పట్ల మరింత గౌరవాన్ని
ప్రదర్శించాల్సి ఉండగా, వారి మనోభావాలు
తినే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు మంత్రి శ్రీనివాస్ యాదవ్. గతంలో కూడా అనేక సందర్బాలలో ఇదే
విధమైన చర్యలకు పాల్పడ్డారని అఖిల భారత పశువైద్య సంఘం జోనల్ సెక్రెటరీ డాక్టర్ M. కిరణ్ కుమార్
మంత్రికి వివరించారు. మేనకాగాంధీ బేషరతుగా పశువైద్యులకు క్షమాపణలు చెప్పాలని
డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా పశువైద్యుల సంఘం ఉపాధ్యక్షులు కర్నాటి
శ్రీనివాసులు, ప్రైవేట్
ప్రాక్టీషనర్స్ సంఘం ప్రతినిధులు డాక్టర్ మురళీధర్, డాక్టర్ లక్ష్మి తదితరులు ఉన్నారు.
0 Comments