అదిలాబాద్, రైతుముచ్చట: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం... రైతు ఏడ్చిన
రాజ్యం... ఎప్పుడూ సంతోషంగా ఉండదన్న మాటని బలంగా నమ్మిన చేవెళ్ళ ఎంపీ డాక్టర్
రంజిత్ రెడ్డి మరోసారి రైతుకీ అండగా ఉండటంలో తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. తన
నియోజకవర్గం కాకపోయిన, తనకి ఓట్లు రావు అని తెలిసిన కూడా
కష్టం వచ్చిన రైతుకు సేవ చేయడంలో పక్షపాతం ఉండొద్దని నిరూపించారు. ఇందులో భాగంగానే
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన కోవ అభిమాన్ రైతు తన కాడెద్దు ఆ ముందు రోజే చనిపోవడంతో
తన కుమారుడు సాయినాథ్ ను ఎద్దుగా మార్చి దుక్కి దున్నుతున్న వార్త ఇటు పత్రికలలో, అటు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ వార్త చదవగానే చలించిపోయిన ఎంపీ
రంజిత్ రెడ్డి, ఆ రైతుకి ఎద్దు కొనిచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఈ మేరకు బుధవారం ఆయన అక్కడి పశు వైద్యుడితో మాట్లాడి ఎద్దుకి ఎంత ఖర్చు అవుతుందో
కనుకొని అందుకు సంబంధించిన డబ్బులను స్థానికుల ద్వారా పంపించారు. రైతు అభిమాన్
ఇంటికి ఎద్దుని తీసుకొని పోవడంతో హర్షం వ్యక్తం చేసిన రైతు. తమ కష్టాన్ని
అర్థం చేసుకొని ఎంపీ స్పందించడం తమకి ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments